బిడ్డ మరణం తట్టుకోలేక తండ్రి సూసైడ్

బిడ్డ మరణం తట్టుకోలేక తండ్రి సూసైడ్

పెద్దపల్లి జిల్లా ధర్మారంలో విషాదం

పెద్దపల్లి, వెలుగు: కూతురు మరణం తట్టుకోలేక ఓ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లిలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కటికెనపల్లికి చెందిన అనుపురం నర్సయ్య(70)కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. భార్య భూదేవి గతంలోనే చనిపోయింది. పెండ్లి కాకుండా ఇంట్లో ఉన్న కూతురు మమత(28)ను, నర్సయ్యను ఇద్దరు కొడుకులు పట్టించుకోలేదు. మమత అనారోగ్యంతో కరీంనగర్‌లోని ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూ సోమవారం చనిపోయింది. బిడ్డ చనిపోయిందన్న వార్త విన్న తండ్రి నర్సయ్య .. మలి దశలో ఉన్న తనను ఎవరు పోషిస్తారని ఆందోళన చెందాడు. అదే రాత్రి పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా ట్రీట్‌మెంట్ పొందుతూ మంగళవారం చనిపోయాడు.

For More News..

గల్ఫ్‌‌‌‌ కార్మికుల కష్టాలపై ఏం చర్యలు తీసుకుంటున్రు

కరోనా సోకినా.. ప్రాపర్టీ సర్వే చేస్తున్న విలేజ్ సెక్రటరీ

దుబ్బాకలో రసవత్తరం.. వంద ఓటర్లకో ఇన్​చార్జి..