తనకు పుట్టలేదనే అనుమానంతో 3నెలల పసికందును చంపిన తండ్రి

తనకు పుట్టలేదనే అనుమానంతో 3నెలల పసికందును చంపిన తండ్రి

తనకు పుట్టలేదనే అనుమానంతో మూడు నెలల పసికందును చంపాడో తండ్రి. కడప జిల్లా వేంపల్లె కు చెందిన గజేంద్ర, కృషిత దంపతులు ఓ పాపకు జన్మనిచ్చారు. అయితే గజేంద్ర తన రెండో భార్య కృషితను వివాహేతర సంబంధం పేరుతో అనుమానించేవాడు.   ఆ అనుమానమే పసికందు పాలిట శాపమైంది. అనుమానం పెంచుకున్న నిందితుడు భార్యపై లేని సమయంలో పసికందును హతమార్చి పాపాఘ్ని నదీ తీరంలో పూడ్చిపెట్టాడు. పాప కనిపించకపోవడంతో భయాందోళనకు గురైన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గంజేంద్రపై అనుమానం వ్యక్తం చేశారు. తనదైన స్టైల్లో  పోలీసులు నిందితుణ్ని విచారించగా దారుణం వెలుగులోకి వచ్చింది. చిన్నారిని తానే హత్య చేసి, పాపాఘ్ని నదీతీరంలో పూడ్చిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా చిన్నారి మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.