తమిళనాడులో దారుణం జరిగింది. ఓ బాలుడి కళ్ల ముందే అతని తండ్రిని కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన దిండిగల్ ప్రాంతంలో శనివారం జరిగింది. దిండిగల్కు చెందిన 42 ఏళ్ల మణికందన్ తేనిలోని ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తూ.. వారాంతాల్లో తన తండ్రి నిర్వహిస్తోన్న ఫర్నిచర్ వ్యాపారాన్ని కూడా చూసుకునేవాడు. ఈ క్రమంలో ఆగష్టు 7న మణికందన్ షాపులో ఉన్నాడు. అతని భార్య గుడికి వెళ్తూ 12 ఏళ్ల తన కొడుకుని భర్త వద్ద షాపులో వదిలి వెళ్లింది. కాసేపటికే కొంతమంది దుండగులు పదునైన ఆయుధాలతో ఫర్నిచర్ దుకాణంలోకి ప్రవేశించి మణికందన్ను నరికి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
మణికందన్ను అతని కొడుకు కళ్ల ముందే చంపడంతో ఆ పిల్లాడు షాక్లో ఉండిపోయాడు. పోలీసులు నెమ్మదిగా సముదాయించి, అతడు తేరుకున్నాక ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ‘ఎనిమిది మంది వ్యక్తులు కొడవళ్లతో షాపులోకి ప్రవేశించి మా నాన్నను నరికారు’ అని 12 ఏళ్ల బాలుడు తెలిపాడు. మణికందన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.