టిప్ విషయంలో యువకులకు వెయిటర్ కి గొడవ

టిప్ విషయంలో యువకులకు వెయిటర్ కి గొడవ

టిప్ విషయంలో యువకులకు వెయిటర్ కి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని బావార్చి హోటల్ లో జరిగింది. మంగళవారం రాత్రి కొంతమంది యువకులు బిర్యానీ తినడానికి హోటల్ కి వెళ్లారు. బిర్యానీ తిన్న తర్వాత బిల్ చెల్లించి వెళ్తున్న యువకులతో వారికి సర్వ్ చేసిన వెయిటర్ టిప్ అడిగాడు. దానికి యువకులు లేవని చెప్పి వెళ్లిపోబోయారు. నాకు టిప్పు ఇవ్వరా అంటూ వెయిటర్ ఆ యువకులతో గొడవకు దిగాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన పోలీసులు.. యువకులకు సర్దిచెప్పారు. టిప్ ఇవ్వలేదని వెయిటర్ తమపై దాడిచేశాడని, అతనికి సపోర్టుగా హోటల్ యాజమాన్యం కూడా దాడికి పాల్పడిందని పోలీసులకు తెలిపారు. ఎయిర్ పోర్ట్ బావార్చి హోటల్  పై కఠిన చర్యలు తీసుకోవాలని యువకుల డిమాండ్ చేశారు.