పాల డెయిరీలో రూ. 50 కోసం గొడవ.. యువకుడు మృతి

పాల డెయిరీలో రూ. 50 కోసం గొడవ.. యువకుడు మృతి
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఘోరం జరిగింది. రూ. 50 అప్పు విషయంలో జరిగిన గొడవలో ఒక వ్యక్తిపై దాడిచేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సత్తెనపల్లికి చెందిన బాజీ సంగం డెయిరీ నిర్వహిస్తున్నాడు. రోజూ అక్కడే పాలు తీసుకునే వ్యక్తి.. బాజీకి రూ. 50 అప్పు పడ్డాడు. ఆ విషయంలో బాజీకి.. సదరు వ్యక్తికి గొడవజరిగింది. మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వచ్చింది. అప్పు పడిన వ్యక్తి.. బాజీపై పిడిగుద్దులు గుద్దడంతో బాజీ కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. For More News.. న్యూడ్‌గా మాట్లాడుకుందామని చెప్పుడు.. స్క్రీన్ షాట్ తీసి బెదిరించుడు.. ఇంటర్​ ఎగ్జామ్స్​ మే 3 నుంచి! ఫస్టియర్​లో ఫెయిలైనోళ్లను పాస్​ చేసే యోచన కేసీఆర్ ప్రోగ్రాంలకు తగ్గిన వ్యూయర్​షిప్.. లక్షల నుంచి వందల్లోకి చేరిన వీక్షకులు