విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి :  సినీ నటుడు సుమన్

విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి :  సినీ నటుడు సుమన్

కోదాడ, వెలుగు : విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆకాంక్షించారు. కోదాడకు చెందిన విజయీభవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో  ఉత్తమ మార్కులు సాధించిన 180 మంది విద్యార్థులకు బుధవారం కోదాడలో ప్రతిభాపురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమానికి హీరో సుమన్​ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు విజయీభవ ప్రతిభా అవార్డ్స్ ఇవ్వడం అభినందనీయమన్నారు. విద్యార్థులు అన్ని  రంగాల్లో రాణించాలని సూచించారు.

విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమన్నారు. అనంతరం ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెద్ద జాతీయ జెండాను సందర్శించారు. కార్యక్రమంలో విజయీభవ వ్యవస్థాపకుడు చారుగుండ్ల రాజశేఖర్, సభ్యులు చారుగుండ్ల ప్రవీణ, వంగవేటి లోకేశ్, ఇరుకుళ్ల చెన్నకేశవరావు, పట్టణ ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు, కిట్స్ మహిళా కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.