సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య పై సినిమా

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య పై సినిమా

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోగా.. ఆయన సూసైడ్ చేసుకోడానికి ఇప్పటికీ వరకు సరైన కారణాలు తెలియరాలేదు. కొందరు ఇది హత్య అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో… సుశాంత్ మృతిని కథాంశంగా తీసుకుని బాలీవుడ్ నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా ‘సూసైడ్ ఆర్ మర్డర్’ పేరుతో  సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో సుశాంత్ పాత్రను ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ తివారీ పోషిస్తున్నాడు. చూసేందుకు సుశాంత్ లా కనిపించే సచిన్ తివారీకి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదని నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా తెలిపారు.

ప్రస్తుతానికి సగం స్క్రిప్టు పూర్తయిందని, సెప్టెంబరులో షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు నిర్మాత విజయ్. తమ సినిమా చూస్తే బాలీవుడ్ లో బంధుప్రీతి, సినీ మాఫియాపై ఉన్న డౌట్స్ తీరతాయని అన్నారు. ఇందులో సుశాంత్ వ్యవహారమే కాకుండా, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొని ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరి జీవితాలను కూడా చూపిస్తున్నామని తెలిపారు.