హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలో తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సిరీస్ అయిన ఎఫ్ఐఎం ఈ ఎక్స్ప్లోరర్ వరల్డ్కప్... ఏబీబీ ఫార్ములా–ఈ రేస్ వరల్డ్ చాంపియన్షిప్తో జట్టు కట్టనుంది. ఏప్రిల్ 13,14న మిసానోలో జరుగనున్న ఫార్ములా– ఈ రేసు సందర్భంగా ఇరు పక్షాలు తమ సాంకేతికత పరిజ్ఞానం పంచుకోనున్నాయి. ఎఫ్ఐఎం ఈ –ఎక్స్ప్లోరర్లో పోటీ పడుతున్న ఇండియాకు చెందిన ఇండీ రేసింగ్ టీమ్ సైతం ఇందులో పాల్గొననుంది.
ఇది ఇండియన్ మోటార్ రేసింగ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి తమకు ఒక మంచి వేదికను అందిస్తుందని ఇండీ రేసింగ్ టీమ్ సీఈవో అభిషేక్ రెడ్డి తెలిపారు. ఏబీబీ, ఎఫ్ఐఎం జాయింట్ వర్క్షాప్లు, మ్యూచువల్ లెర్నింగ్, నాలెడ్జ్ షేరింగ్, ఈవీ వెహికల్స్ అభివృద్దిలో సహకారం కొనసాగింపు వంటి అంశాలపై చర్చలో ఇండీ రేసింగ్ జట్టు పాల్గొంటుందని చెప్పారు.