ఎయిమ్స్‭లో చేరిన నిర్మలా సీతారామన్

ఎయిమ్స్‭లో చేరిన నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఓ ప్రైవేటు వార్డులో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె ఆస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కడుపులో ఇన్ఫెక్షన్, రొటీన్ చెకప్ కోసం నిర్మలా సీతారామన్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సాయంత్రం హెల్త్ బులెటివ్ విడుదల చేసే అవకాశముంది.

నిన్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా.. ఢిల్లీలోని 'సదైవ్ అటల్'లో సీతారామన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల, తమిళనాడులోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన కాన్వొకేషన్ వేడుకలోనూ ఆమె పాల్గొన్నారు.