కరీంనగర పట్టణంలో అగ్నిప్రమాదం..కోటి రూపాయల నష్టం

కరీంనగర పట్టణంలో అగ్నిప్రమాదం..కోటి రూపాయల నష్టం

కరీంనగర్లో  భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కరీంనగర్ బైపాస్ రోడ్డు సమీపంలోని రజ్వీ చమాన్  దగ్గర  గొనె సంచుల  గోడౌన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పేశారు. 

గురువారం  అర్ధరాత్రి అగ్ని  ప్రమాదం జరిగినట్లు  స్థానికులు చెబుతున్నారు. గోడౌన్ నుంచి భారీగా మంటలు ఎగసి  పడటంతో  స్థానికులు  భయాందోళనలు  గురయ్యారు. అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు కోటి రూపాయల  ఆస్తి నష్టం  జరిగినట్లు పోలీసులు తెలిపారు.  ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని చెప్పారు. షార్ట్‌ సర్య్కూట్‌ వల్లే మంటలు చెలరేగాయన్నారు. గోదాములో 40 వేల గోనెసంచులు ఉన్నాయని.. ప్రమాదంలో అన్నీ కాలిపోయాయని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.