పాఠ్య పుస్తకాల ముద్రణ ఆఫీసులో అగ్ని ప్రమాదం

పాఠ్య పుస్తకాల ముద్రణ ఆఫీసులో అగ్ని ప్రమాదం
  • కాలిపోయిన ప్రింటింగ్ మెషీన్లు, పుస్తకాలు

బషీర్ బాగ్, వెలుగు: మింట్ కాంపౌండ్ లోని ప్రభుత్వ పాఠ్య పుస్తకా ముద్రణ ఆఫీసులో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ప్రింటింగ్ మెషీన్లు, పుస్తకాలు మంటల్లో కాలిపోయాయి.

ఆఫీసులో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది ఫైర్​స్టేషన్​కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు.