బిగ్​బాస్​పై ఫైర్​ అయితున్నరు

బిగ్​బాస్​పై ఫైర్​ అయితున్నరు

బిగ్​ బాస్​ సీజన్​–5 పూర్తయింది. విన్నర్​తో పాటు రన్నరప్స్​ కూడా ఇంటర్వ్యూలతో తీరిక లేకుండా ఉన్నారు. కానీ, టాప్​–3 కంటెస్టెంట్​ సింగర్​ శ్రీరామచంద్ర మాత్రం ట్రీట్మెంట్​తో బిజీ అయ్యాడు. బిగ్​ బాస్​ ఐస్​ ఛాలెంజ్ టాస్కు తర్వాత.. ప్రియాంక శ్రీరామ్​ కాళ్లపై వేడినీళ్లు పోసింది. దానివల్ల అతని పాదాల దగ్గరి చర్మం పూర్తిగా ఊడిపోయింది. బిగ్​బాస్​ ట్రీట్మెంట్​ ఇప్పించినప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు శ్రీరామచంద్ర. దాంతో హౌస్​ నుంచి బయటికొచ్చాక కూడా ట్రీట్మెంట్​ తీసుకుంటున్నాడు. దానికి సంబంధించిన వీడియోని రీసెంట్​గా ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశాడు ఈ సింగర్. ‘ నేను ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నా.. కొత్త చర్మం.. కొత్త లైఫ్.. మీ ప్రేమ’ అనే క్యాప్షన్​తో ఉన్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్​ కామెంట్లు పెడుతున్నారు. కొందరు బిగ్​బాస్​ని తప్పు పడుతున్నారు కూడా. వేడినీళ్లు పోస్తున్నప్పుడు 70 కెమెరాలు ఏం చేశాయి? బిగ్​ బాస్​ అప్పుడెందుకు మాట్లాడలేదు? టీఆర్పీ కోసం ఇలాంటి వాటిని ఎంకరేజ్​ చేస్తారా? అని గట్టిగా అడుగుతున్నారు.