మెస్‌లో గొడవ.. సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు

మెస్‌లో గొడవ.. సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు

ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో కాల్పులు కలకలం రేపాయి. మండల కేంద్రంలోని 39 సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో ఆదివారం ఉదయం జరిగింది. బెటాలియన్‌లోని స్టీఫెన్, ఎస్ఐ ర్యాంకు అధికారి ఉమేష్ చంద్ర అనే జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. రెండు రౌండ్ల కాల్పులు జరిగాయి.   CRPF ఎస్సై ఉమేష్ చంద్ర, కానిస్టేబుల్ స్టిఫెన్ కు మధ్య గొడవ జరగడంతో కాల్పులు జరుపుకున్నారు. కాల్పుల్లో ఎస్సై ఉమేష్ చంద్ర స్పాట్ లోనే చనిపోయాడు. కానిస్టేబుల్ స్టిఫెన్ కు తీవ్రగాయాలు కావడంతో ఏటూరునాగారం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. మెస్ దగ్గర గొడవ పడి ఒకరి పై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఎస్సై ఉమేష్ చంద్ర సొంతూరు బీహర్ గా చెప్తున్నారు. గాయపడిన కానిస్టేబుల్ ది కన్యాకుమారి అని తెలిపారు పోలీస్ అధికారులు