గ్రేస్ మార్కులు ఇచ్చి పాస్ చేయండి.. గాంధీ ఆస్పత్రి స్టూడెంట్స్ ఆందోళన

గ్రేస్ మార్కులు ఇచ్చి పాస్ చేయండి.. గాంధీ ఆస్పత్రి స్టూడెంట్స్ ఆందోళన

పద్మారావునగర్​, వెలుగు: గాంధీ మెడికల్ కాలేజీలో బీఎస్సీ అలైడ్​హెల్త్ సైన్స్​కోర్సు ఫస్ట్  బ్యాచ్ ​స్టూడెంట్స్​తమకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్​ మాట్లాడుతూ... ఫస్ట్​ టైమ్​ కాళోజీ హెల్త్ వర్సిటీ ఆధ్వర్యంలో తెలంగాణలోని తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కోర్సు ప్రవేశపెట్టారన్నారు. మూడేండ్ల థియరీ, వన్​ఇయర్​ ఇంటర్న్​ షిప్​ చేయాల్సి ఉంటుందని వివరించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యంగా అడ్మిషన్లు ఇవ్వడం, పరీక్షలు నిర్వహించారన్నారు.  

గాంధీ మెడికల్​ కాలేజీలో 160 మంది పరీక్షలు రాయగా, ఐదుగురు మాత్రమే పాస్​ అయ్యారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 746 మంది ఎగ్జామ్​ రాయగా, కేవలం 25 మంది మాత్రమే పాస్​అయ్యారన్నారు. కోర్సుకు తగిన సిలబస్​, క్లాస్​ లు సరిగా నిర్వహించలేదన్నారు. కాలేజీ అధికారులు, ఫ్యాకల్టీ నిర్లక్ష్యం కారణంగానే  ఫెయిలయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్రేస్​ మార్కులు కలిపి పాస్​ చేయాలని డిమాండ్ చేశారు. 

బీఎస్సీ అలైడ్​ హెల్త్ సైన్స్​ కోర్సుకు సక్రమంగానే క్లాస్​ లు నిర్వహించామని, కాళోజీ హెల్త్ వర్సిటీలో పరీక్షలు నిర్వహించి, పేపర్లు దిద్దారని,  దీంతో తమకు సంబంధం లేదని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్​ రమేశ్​ రెడ్డి వివరణ ఇచ్చారు. ఫెయిల్ అయిన సెకండ్ ఇయర్  బ్యాక్​ లాగ్​ సబ్జెక్ట్​ లను రాసుకునే చాన్స్ ఉందన్నారు. ఆస్పత్రి ఎదుట స్టూడెంట్స ఆందోళన సరికాదన్నారు.