భారత్ లో తొలి కరోనా కేసు నమోదు

భారత్ లో తొలి కరోనా కేసు నమోదు

చైనా వ్యాపించి… ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక వైరస్ కరోనా. తీవ్రంగా కలవర పెడుతున్న ఈ వైరస్ భారత్‌లోకి ఎంటరైంది. కరోనా వైరస్ సోకిన మొదటి కేసు కేరళలో నమోదయ్యింది. చైనాలోని వుహాన్‌ వర్శిటిలీలో చదువుతోన్న ఓ విద్యార్థి ఇటీవల కేరళకు వచ్చాడు. అనారోగ్యంతో ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. మెడికల్ టెస్ట్ లు చేసిన డాక్టర్లు కరోనా వైరస్ సోకిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కరోనా వైరస్ సోకిందని అనుమానం వ్యక్తమవుతోన్న కొందరిని పలు రాష్ట్రాల్లో మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. ఆరోగ్యశాఖ సూచనలతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.