కర్ఫ్యూ పాటిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలపండి: మెలానియా

కర్ఫ్యూ పాటిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలపండి: మెలానియా

వాషింగ్టన్‌: ఆఫ్రికన్‌ – అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా ఆందోళన చేస్తున్న వారు శాంతియుతంగా నిరసన తెలపాలని అమెరికా ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌ విజ్ఞప్తి చేశారు. అమెరికాలో ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ రూల్స్‌ను పాటించాలని, వీధులు వదిలి ఇళ్లలోకి వెళ్లిపోవాలని మెలానియా ట్రంప్‌ కోరారు. శాంతియుత పద్ధతితో నిరసన తెలియజేయాలని రిక్వెస్ట్‌ చేశారు. “ కలిసి కట్టుగా పనిచేస్తేనే అన్ని నగరాల్లో ప్రజలకు భద్రత కల్పించగలం. అందరూ వీధులు వదిలి ఇళ్లలోకి వెళ్లండి. ఫ్యామిలీతో గడపండి” అని మెలానియా ట్వీట్‌ చేశారు. అమెరికన్లు గొడవకు దిగొద్దని ఆమె రిక్వెస్ట్‌ చేశారు. శాంతియు ఆందోళనలను అమెరికా స్వాగతిస్తుందని, హింస వద్దని ఆమె మరో ట్వీట్‌ చేశారు. ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతిని నిరసిస్తూ అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనకారులను తరిమికొట్టేందుకు చాలా చోట్ల కర్ఫ్యూ విధించారు. ఆందోళనలు వైట్‌హౌస్‌ను కూడా తాకడంతో ట్రంప్‌ తన కుటుంబంతో పాటు రెండు రోజులు బంకర్లలోకి వెళ్లారు.