బ్రిస్బేన్: వరల్డ్ క్రికెట్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాషెస్ సమరానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఫస్ట్ టెస్ట్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. 1956 తర్వాత ఓ పేస్ బౌలర్ ఆసీస్ టీమ్ను నడిపిస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ప్యాట్ కమిన్స్పైనే నెలకొంది. ఇన్నాళ్లూ ఓ స్టార్ బౌలర్గా సేవలందించిన కమిన్స్ ఇప్పుడు సారథ్యం ఎలా చేస్తాడోనన్న ఉత్కంఠ కూడా మొదలైంది. అయితే గతంలో ఆసీస్ను సక్సెస్ఫుల్గా నడిపించిన మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఇప్పుడు వైస్ కెప్టెన్గా ఉండటం కమిన్స్కు కలిసొచ్చే అంశం.
మరోవైపు వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్కు ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో విశ్రాంతి కల్పించారు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ కాస్త ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. అయితే సీనియర్ ప్లేయర్లందరూ అతనికి సపోర్ట్గా నిలుస్తామని బట్లర్ వెల్లడించాడు.