దేశంలో ఫస్ట్ టైం హయ్యస్ట్ రికార్డు కరోనా కేసులు

దేశంలో ఫస్ట్ టైం హయ్యస్ట్ రికార్డు కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు రోజురోజూకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో 77,266 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర కుటుంబ మరియు సంక్షేమ శాఖ తెలిపింది. ఇంత భారీ మొత్తంలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దాంతో ఇప్పటివరకు దేశంలో నమోదయిన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 33,87,501కి చేరింది. ఇందులో 7,42,023 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 60,176 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 25,83,948గా ఉంది. గురువారం దేశవ్యాప్తంగా 1057 మంది కరోనాతో మ‌రణించారు. దాంతో దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 61,529కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

గురువారం దేశవ్యాప్తంగా 9,01,338 కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దాంతో ఇప్పటివరకు దేశంలో 3,94,77,848 టెస్టులు చేసినట్లు తెలిపింది.

For More News..

గణేష్ నిమజ్జనంలో ఆర్మీ మాజీ ఉద్యోగి కాల్పులు

రాష్ట్రంలో మరో 2,932 కరోనా కేసులు

ఇష్టారాజ్యంగా కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతులు