Delhi liquor scam : ఈడీ ఛార్జ్షీట్లో ఐదుగురి పేర్లు

Delhi liquor scam : ఈడీ ఛార్జ్షీట్లో ఐదుగురి పేర్లు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ జరిపింది. 13,657పేజీలతో కూడిన ఛార్జ్ షీటును న్యాయస్థానం పరిశీలించనుంది. మొదటి ఛార్జ్ షీటులో ఏ1గా సమీర్ మహేంద్రు, ఏ2, ఏ3, ఏ4, ఏ5లుగా సమీర్ మహేంద్రుకు చెందిన కంపెనీలను ఈడీ చేర్చింది. సప్లిమెంటరీ ఛార్జ్ షీటులో ఈడీ ఐదుగురు వ్యక్తులతో పాటు 7 కంపెనీల పేర్లు ప్రస్తావించింది. శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్,అమిత్ అరోరాలను నిందితులుగా చేర్చింది.  లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ లో ఆరుగురు వ్యక్తులు, 11 కంపెనీల పేర్లను ప్రస్తావించింది.