కేయూ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురితో స్టీరింగ్ కమిటీ

కేయూ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురితో స్టీరింగ్ కమిటీ

హసన్ పర్తి, వెలుగు: కాకతీయ వర్సిటీలో వచ్చే నెల 7న జరిగే 23వ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురు ప్రొఫెసర్లతో  స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రిజిస్ట్రార్ ప్రొ. రామచంద్రం  శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ప్రొఫెసర్లు మనోహర్, వాసుదేవరెడ్డి,  వరలక్ష్మి, మెంబర్ కన్వీనర్ గా కట్ల రాజేందర్ ను నియమించారు. వీసీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ స్నాతకోత్సవ నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  

స్నాతకోత్సవాన్ని సక్సెస్ చేసేందుకు వర్సిటీ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు.  2020 –2025 మధ్య పీహెచ్డీలు పూర్తి చేసిన 579 మందికి పట్టాలు ప్రదానం చేయనున్నట్టు కట్ల రాజేందర్ తెలిపారు. ఇప్పటికే 331 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.  అదేవిధంగా 2015-–16  నుంచి 2020-– 21 మధ్య కాలంలో ప్రతిభచూపిన విద్యార్థులకు 564 గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు.