ఐదు రోజుల జైలు శిక్ష

ఐదు రోజుల  జైలు శిక్ష

కరీంనగర్‌క్రైం, వెలుగు:  మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఐదుగురికి  జైలు శిక్ష విధిస్తూ కరీంనగర్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ సరళరేఖ  తీర్పు  ఇచ్చారు.  మద్యం తాగిన వారిని మంగళవారం ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్  రమేశ్​ కోర్టులో  హాజరు పరిచారు. 

కొత్తపల్లి  మండలం చింతకుంట గ్రామానికి చెందిన అయిన మలోత్ రాజుకు ఐదు రోజుల జైలు శిక్షతోపాటు  రూ.2 వేల జరిమానా విధించారు. మిగితా నలుగురికి కలిపి రూ.9,500 జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు. 

ALSO READ :ఆవుతో లింకేంటీ.. మ‌ళ్లీ ఆవును ఢీకొన్న వందే భార‌త్ రైలు