ఇటలీ నుంచి వచ్చిన మరో విమానంలో 173 మందికి కరోనా

ఇటలీ నుంచి వచ్చిన మరో విమానంలో 173 మందికి కరోనా

విదేశాల నుంచి భారత్‌కు వస్తోన్న విమానాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుండటం కలకలం రేపుతోంది. నిన్న(గురువారం) ఇటలీ నుంచి పంజాబ్‌ వచ్చిన ఓ విమానంలో 125 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. లేటెస్టుగా  అదే దేశం నుంచి వచ్చిన మరో విమానంలోనూ 173 మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

ఇటలీలోని రోమ్‌ నుంచి ఓ విమానం ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం అమృత్‌సర్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు  చేరుకుంది. అందులో 290 మంది ప్రయాణికులున్నారు. కేంద్రం నిబంధనల ప్రకారం.. వీరికి ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు చేయగా.. 173 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో బాధితులను ఐసోలేషన్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

మరిన్ని వార్తల కోసం...

ఒమిక్రాన్ టెన్షన్: ఎట్ రిస్క్ దేశాల సంఖ్య పెంపు