గాలిలో ఉన్న విమానంలో మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో గొడవ పడి ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కు కారణమైన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి చెన్నైలోని కొచ్చికి వెళ్తున్న ఓ విమానంలో నలుగురు ప్రయాణికులు మద్యం తాగి ఉన్నారు.
అదే మత్తులో తోటి ప్యాసింజర్ లతో గొడవకు దిగారు. క్యాబిన్సిబ్బందిపై దాడి చేశారు. పైలట్కి సమాచారం అందడటంతో ఫ్లైట్ని దారి మళ్లించి హైదరాబాద్లోని శంషాబాద్ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. నగరంలో ల్యాండ్కాగానే స్టాఫ్పోలీసులుకు కంప్లెంట్ చేశారు.
అప్పటికే అక్కడికి వచ్చిన భద్రతా అధికారులు నిందితుల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.