విమానంలో కొట్టుకున్నారు.. హైదరాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండ్

విమానంలో కొట్టుకున్నారు.. హైదరాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండ్

గాలిలో ఉన్న విమానంలో మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో గొడవ పడి ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్​కు కారణమైన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్​ నుంచి చెన్నైలోని కొచ్చికి వెళ్తున్న ఓ విమానంలో నలుగురు ప్రయాణికులు మద్యం తాగి ఉన్నారు. 

అదే మత్తులో తోటి ప్యాసింజర్ లతో గొడవకు దిగారు. క్యాబిన్​సిబ్బందిపై  దాడి చేశారు.  పైలట్​కి సమాచారం అందడటంతో ఫ్లైట్​ని దారి మళ్లించి హైదరాబాద్లోని శంషాబాద్​ఎయిర్​పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్​ చేశాడు. నగరంలో ల్యాండ్​కాగానే స్టాఫ్​పోలీసులుకు కంప్లెంట్​ చేశారు. 

అప్పటికే అక్కడికి వచ్చిన భద్రతా అధికారులు నిందితుల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.