నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద..20గేట్లు ఓపెన్

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద..20గేట్లు ఓపెన్

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. శనివారం(ఆగస్టు16) కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టులోని 20 క్రస్ట్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్టుకు ప్రస్తుత ఇన్ ఫ్లో 1లక్షా 99వేల 544 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1లక్షాల 86వేల 860 క్యూసెక్కులుగా ఉంది. దీంతో డ్యామ్ నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని చూసేందుకు, డ్యాం పరిసర ప్రాంతాల్లో ప్రకృతి అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

 నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం  589.40 అడుగులుగా ఉంది.  సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం  312 టీఎంసీలు..ప్రస్తుతం 310.510 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

సాగర్  గేట్లు ఎత్తటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. 

►ALSO READ | తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్..