ధోని అంటే ఇష్టం.. నా ఫోకస్ అంతా ఆటపైనే

ధోని అంటే ఇష్టం.. నా ఫోకస్ అంతా ఆటపైనే

కోల్‌ కతా: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌‌ ధోనీ అంటే ఇష్టమన్న వికెట్ కీపర్‌‌ బ్యాట్స్‌ మన్‌ రిషబ్‌ పంత్ తన దృష్టంతా ఆటను మెరుగుపరుచుకోవడంపైనే ఉంటుందన్నాడు. ధోనీ వారసుడు పంత్‌ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోనని తెలిపాడు.ధోనీ అంటే చాలా ఇష్టం . ప్రస్తుతం ఆడబోయే మ్యాచ్‌ కోసం ఆలోచిస్తా. ఎప్పటికప్పుడు నాగేమ్‌ నుమెరుగుచేసుకునేం దకు ట్రై చేస్తుం టా అని పంత్ చెప్పాడు.
అంతేకాక వెస్టిండీస్‌‌లో టీమిండియా బాగా ఆడిందన్నరిషబ్‌ .. జట్టుకు మ్యాచ్‌ విన్నర్‌‌గా ఉండాలని అనుకున్నట్టున్నట్లు తెలిపాడు. సౌతాఫ్రికా
సిరీస్‌‌లో తమ జట్టు రాణిస్తుందనేనమ్మకముందని, అయితే ప్రొటీస్‌‌ టీమ్‌ కూడా బలంగానే ఉందని పంత్‌ అన్నాడు.