హైదరాబాద్, వెలుగు: గాయకుడు, వైఎస్సార్టీపీ నాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్లో చేరనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ఫంక్షన్హాల్లో మంత్రి కేటీఆర్తో ఆయన భేటీ అయ్యారు. ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్తో కలిసి ఆయన మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరాలని సోమన్నను కేటీఆర్ ఆహ్వానించారు.
త్వరలోనే పార్టీ కండువా కప్పుకుంటానని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన సోమన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్తో విభేదించి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత వైఎస్సార్టీపీలో జాయిన్అయ్యారు. సోమన్నకు కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.