బీఆర్ఎస్​లోకి ఏపూరి సోమన్న

బీఆర్ఎస్​లోకి ఏపూరి సోమన్న

హైదరాబాద్, వెలుగు: గాయకుడు, వైఎస్సార్​టీపీ నాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్​లో చేరనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్​లోని ఒక ప్రైవేట్​ఫంక్షన్​హాల్​లో మంత్రి కేటీఆర్​తో ఆయన భేటీ అయ్యారు. ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్​తో కలిసి ఆయన మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్​లో చేరాలని సోమన్నను కేటీఆర్ ఆహ్వానించారు. 

త్వరలోనే పార్టీ కండువా కప్పుకుంటానని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన సోమన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్​తో విభేదించి కాంగ్రెస్​లో చేరారు. ఆ తర్వాత వైఎస్సార్​టీపీలో జాయిన్​అయ్యారు. సోమన్నకు కార్పొరేషన్ చైర్మన్​గా అవకాశం ఇస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.