హైదరాబాద్ లో వాడిన నూనెతో మళ్లీ మళ్లీ వంటలు..! భారీగా పానీపూరీలు, సమోసాలు సీజ్..

హైదరాబాద్ లో వాడిన నూనెతో మళ్లీ మళ్లీ వంటలు..! భారీగా పానీపూరీలు, సమోసాలు సీజ్..

గండిపేట, వెలుగు : అత్తాపూర్​లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతూ సమోసాలు, పానీ పూరీలు తయారు  చేస్తున్న కేంద్రంపై  ఫుడ్​ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఇక్కడ పానీపూరీలు, సమోసాలు భారీగా తయారు చేసి నగరంలోని వివిధ బండ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. 

ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ లైసెన్స్ లేకుండానే వ్యాపారం సాగుతోందని,  కిచెన్​లో   అపరిశుభ్రత తాండవిస్తోంది. విపరీతమైన ఈగలు కనిపించాయి. ఓపెన్ డ్రైనేజీ పక్కనే వంటలు చేస్తున్నారు.   

ఈ సందర్భంగా 3 వేల పానీపూరీలు, 4 కిలోల సమోసాలు, 2 కిలోల వాడిన నూనెను స్వాధీనం చేసుకుని పారబోశారు.  నాణ్యత పరిశీలనకు నమూనాలు సేకరించి కేంద్రాన్ని సీజ్ చేశారు.