బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 ఏప్రిల్ 8 సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రహేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ దగ్గర జరిగిన ప్రమాదం తర్వాత షకిల్ కుమారుడు రహేల్ దుబాయ్ పారిపోయాడు. దీంతో ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇన్ని రోజుల తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన రహేల్ ను పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. 

కాగా ప్రజా భవన్ దగ్గర జరిగిన ప్రమాదంలో రహేల్ ను తప్పించేందుకు తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్లు చూపించారు నిందితులు. కానీ.. అసలు నిందితుడు రహేల్ గా పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ పుటేజీ చూసి అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.