మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి మాజీ క్రికెటర్ యూవీ సాయం

మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి మాజీ క్రికెటర్ యూవీ సాయం

మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సామాజిక సేవా కార్యక్రమాలో బిజీ అయ్యారు. గతంలో క్యాన్సర్ బాధితుడైన యువీ, ప్రధానంగా వైద్య, ఆరోగ్య రంగంలో సేవల కోసం ప్రత్యేకంగా తన పేరుతో ఫౌండేషన్ స్థాపించాడు. ఈ స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన వింగ్ 'యూ వుయ్ కెన్'. ఇది ప్రధానంగా క్యాన్సర్ బాధితులకు సాయమందిస్తోంది. 

యువరాజ్ సింగ్ తన యూ వుయ్ కెన్ సంస్థతో కలిసి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి భారీగా సాయం అందించారు. రూ.1 కోటి విలువైన 50 క్రిటికల్ కేర్ బెడ్లను, అత్యాధునిక వైద్య ఉపకరణాలను విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన పేపర్లను 'యూ వుయ్ కెన్' సంస్థ ప్రతినిధులు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అందించారు.