హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆయన ఢిల్లీ బయల్దేరారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బీజేపీలో చేరతారన్న ప్రచారంతో ఈటల ఢిల్లీ ప్రయాణానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇటీవల కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్తో ఈటల భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే సోమవారం ఉదయం11 గంటలకు బీజేపీ నేత జేపీ నడ్డాతో ఈటల భేటీ కానున్నారు. రేపు ఉదయం ఢిల్లీకి బీజేపీ నేత బండి సంజయ్ వెళ్లనున్నారు. ఈటలను నడ్డా దగ్గరకు బండి సంజయ్ తీసుకెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా ఈటల కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.