
సూర్యాపేట: మమ్మల్ని ఇష్టం వచ్చిన్నట్లు బూతులు మాట్లాడితే ఎవరూ ఊరుకునే ది లేదని, నిన్న మహా న్యూస్ పై జరిగింది కేవలం శాంపిల్ మాత్రమేమని బీఆర్ఎ స్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. తాము దాడి చేస్తే వేరే విధంగా ఉంటందన్నారు. ఆయుధాలతో దాడులు చేయాలనుకుంటే కేసీఆర్ అభిమానులు లక్షలాదిమంది చూస్తూ కూర్చోరని, వాళ్ల చేతిలోని ఆయుధాలకు వాళ్లు కూడా పని చెప్తారని అన్నారు. జూన్ 29న సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నీళ్ల మంత్రి చదువురాక ప్రతిరోజు కేసిఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని అన్నారు.రాజకీయ డ్రామాలు ఆపి వెంటనే కన్నే పల్లి పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు.
జూన్ 28న మధ్యాహ్నం మహా న్యూస్ ఆఫీసుపై బీఆర్ఎస్నేతలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్వ్యవహారంలోకేటీఆర్పై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహా న్యూస్ఆఫీసు వద్దకు చేరుకున్న బీఆర్ఎస్కార్యకర్తలు.. ఆఫీసు అద్దాలను పగులగొట్టారు. బయట పార్క్చేసిన కార్లను ధ్వంసం చేశారు.
►ALSO READ | యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచంద్ర నాయక్ కు రిమాండ్..
ఆఫీసు లోపలికి ప్రవేశించి న్యూస్స్టూడియో, కెమెరాలనూ ధ్వంసం చేశారు. ఆఫీసు సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగలేదు. దాడి జరిగిన విషయం తెలుసుకుని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్వేర్వేరుగా మహా న్యూస్ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు.