యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచంద్ర నాయక్ కు రిమాండ్..

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచంద్ర నాయక్ కు రిమాండ్..

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడు పూర్ణచంద్ర నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో శనివారం ( జూన్ 28 ) రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు పూర్ణచంద్ర. ఈ క్రమంలో ఆదివారం ( జూన్ 29 ) పూర్ణచంద్రను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్. అతనిపై బి.ఎన్.ఎస్ యాక్ట్ 69 , 108 యాక్ట్ తో పాటు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.

ALSO READ | Anchor Swecha: యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణచంద్ర నాయక్ అరెస్ట్

శనివారం రాత్రి పోలీసులు ఎదుట లొంగిపోయిన పూర్ణచంద్రను విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టారు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడు పూర్ణ చంద్ర నాయక్‎ను పోలీసులు రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తోంది.

కాగా, యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. శుక్రవారం (జూన్ 27) రాత్రి జవహర్ నగర్‎లోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్వేచ్ఛ మరణానికి ఆమెతో సహజీవనం చేస్తోన్న పూర్ణ చంద్ర నాయకే కారణమని స్వేచ్ఛ తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు పూర్ణ చంద్ర నాయక్‎పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే స్టేషన్‎లో లొంగిపోయిన అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.