ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు

ఫోన్ ట్యాపింగ్ కేసు:  సిట్ విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాల వారీగా ప్రత్యర్థుల ఫోన్‌‌ నంబర్లు ట్యాపింగ్‌‌ చేయించిన బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలను ఎంక్వైరీ చేస్తుంది. ఇందులో భాగంగా నకిరేకల్‌‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌‌ యాదవ్‌‌ లు ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌‌ పీఎస్‌‌లోని సిట్‌‌ ఆఫీస్​లో విచారణకు హాజరయ్యారు.

2024  నవంబర్ 16న ఒకసారి విచారణకు  హాజరయ్యారు జైపాల్ యాదవ్.  ఈ  కేసులో నిందితుడు గా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్న జైపాల యాదవ్  మధ్య ఎన్నికల సమయంలో ఫోన్ సంభాషణలు ఉన్నట్లు గుర్తించారు. ఓ కేసులో భార్యభర్తల మధ్య ఉన్న సమస్య పై  తిరుపతన్నతో జైపాల్ యాదవ్ మాట్లాడినట్లు సిట్ కి వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల సమయంలో తిరుపతన్నతో కాల్స్ పై విచారణ చేసి , స్టేట్మెంట్ రికార్డ్  చేస్తోంది సిట్

Also Read : పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే.. నోరు మెదపని సన్నాసి కేసీఆర్

ఈ కేసులో ఎమ్మెల్సీ నవీన్‌‌రావు తండ్రి కొండల్ రావు, కూకట్‌‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్‌‌ రావును బుధవారం ప్రశ్నించాల్సి ఉండగా... కొండల్‌‌రావు వయసు, అనారోగ్యం కారణంగా ఇంట్లోనే స్టేట్‌‌మెంట్‌‌ ఇస్తానని అడ్వకేట్‌‌ ద్వారా సమాచారం అందించారు. సందీప్‌‌ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని.. 4 రోజుల తర్వాత వస్తారని కృష్ణారావు సిట్‌‌ చీఫ్ సజ్జనార్‌‌‌‌కు చెప్పినట్లు తెలిసింది.

చిరుమర్తి, జైపాల్ యాదవ్ విచారణ ఇందుకే!

2023 నవంబర్‌‌‌‌ 15 నుంచి 30 మధ్యకాలంలో సేకరించిన ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ లిస్ట్‌‌ ఆధారంగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నకిరేకల్ నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లా నాయకుల ఫోన్‌‌ నంబర్లను లింగయ్య ట్యాప్ చేయించినట్లు ఇప్పటికే స్పెషల్‌‌ టీమ్‌‌ అధికారులు గుర్తించారు.

 కల్వకుర్తి నియోజకవర్గంలో తన ప్రత్యర్థులు, వారి అనుచరులకు సంబంధించిన ఫోన్‌‌ నంబర్లను మాజీ ఎమ్మెల్యే జైపాల్‌‌ యాదవ్‌‌ ఎస్‌‌ఐబీ స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ టీమ్‌‌కు అందించారు. ఈ మేరకు 2024, నవంబర్‌‌‌‌ 16న స్పెషల్‌‌ టీమ్‌‌ వీరిద్దరి స్టేట్‌‌మెంట్లను రికార్డ్‌‌ చేసింది. ఈ కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, చిరుమర్తి లింగయ్య కాంటాక్ట్స్‌‌తో లింక్‌‌ అయిన దాదాపు 58 ఫోన్‌‌ నంబర్లను సిట్‌‌ సేకరించినట్లు తెలిసింది. 

ఈ క్రమంలోనే జైపాల్‌‌ యాదవ్‌‌ కూడా 2 కుటుంబాలకు చెందిన ఫోన్‌‌ నంబర్లను తిరుపతన్నకు అందించినట్లు సిట్‌‌కు వెల్లడించారు. కాగా, తాను ఇచ్చిన ఫోన్‌‌ నంబర్లు ప్రత్యర్ధులవి కాదని.. రెండు కుటుంబాల మధ్య తలెత్తిన విభేదాల కేసులో వారి నంబర్స్‌‌ ఇచ్చినట్లు జైపాల్‌‌ యాదవ్‌‌ అంగీకరించారు.