సీఎం రేవంత్ తెస్తున్నపెట్టుబడులతో యువతకు ఉపాధి: అజారుద్దీన్

సీఎం రేవంత్ తెస్తున్నపెట్టుబడులతో యువతకు ఉపాధి: అజారుద్దీన్

 సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెస్తున్న పెట్టుబడులు యువతకు ఎంతో ఉపయోగకరమన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడింట్ అజారుద్ధీన్. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మొదటి రోజే భారీ పెట్టుబడులను తెలంగాణాకు తీసుకొచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పారు. 

విద్యుదుత్పత్తి, బ్యాటరీ సెల్ తయారు చేయడానికి ఆదానీ, గోద్రెజ్, జేఎస్ డబ్ల్యూ, గోది, వెబ్ వర్క్స్, ఆరా జెన్ లాంటి సంస్థలతో సుమారు రూ.37,870 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడం కోసం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 

యువతకు నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపించడం కోసం ఆదానీ ముందుకు రావడం తెలంగాణ యువతకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు అజారుద్దీన్. ఇలా అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి... ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా యువతకు ఉపాధికల్పన కోసం పబ్లిక్, ప్రేవేటు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.

ఇప్పటికే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసి... మరో రెండు నెలల్లో మిగతా నాలుగు గ్యారెంటీలను కూడా అమలు చేసి... వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో అత్యధిక పార్లమెంటు సీట్లను గెలుస్తాం అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెలన్నర రోజుల్లోనే ప్రజారంజక పాలనను అందిస్తూ అన్ని వర్గాల నుంచి మన్ననలను పొందుతోందని ఆయన కొనియాడారు.