న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ కుంగిపోతున్న నావ అని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. లోక్సభలో తమ పార్టీని కాపాడుకునేందుకు బీజేపీతో పొత్తులంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్కి మధ్య పొత్తు ఉండదన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ‘మిషన్ 400’నినాదంతో మోదీ శంఖారావం పూరించబోతున్నారని చెప్పారు.