మళ్లీ కాంగ్రెస్​లోకి కుంభం అనిల్​కుమార్​ రెడ్డి?

మళ్లీ కాంగ్రెస్​లోకి  కుంభం అనిల్​కుమార్​ రెడ్డి?
  • మీడియాలో కథనాలు..ఖండించిన​ అనుచరులు.. స్పందించని కుంభం

యాదాద్రి, వెలుగు :  ఇటీవల బీఆర్ఎస్​లో చేరిన యాదాద్రి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​ రెడ్డి మళ్లీ సొంతగూటికి వస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మీడియాలో శనివారం జోరుగా కథనాలు ప్రసారమయ్యాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో విబేధాల కారణంగా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అనిల్​కుమార్​రెడ్డి బీఆర్ఎస్​లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన చేరిన సమయానికి బీఆర్ఎస్​లో​ అభ్యర్థులను ప్రకటించలేదు. తర్వాత భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డినే అభ్యర్థిగా సీఎం కేసీఆర్​ ప్రకటించారు. 

అప్పటి నుంచి కుంభం తిరిగి కాంగ్రెస్​లోకి వస్తారంటూ ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జానారెడ్డి ఫోన్​ చేశారని, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​తో కుంభం భేటీ అయ్యారంటూ లీకులు వచ్చాయి. ఆ కథనాలను కుంభం ఖండించారు. తర్వాత కూడా కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి కాంగ్రెస్​లో చేరడానికి సుముఖంగా ఉన్నారని, ఢిల్లీకి వెళ్తున్నారంటూ సోషల్​ మీడియాలో శనివారం కథనాలు వచ్చాయి. ఏ క్షణమైనా కుంభం ఢిల్లీకి వెళ్లే అవకాశముందంటూ బ్రేకింగ్​ న్యూస్‌లు వచ్చాయి.  అయితే ఈ వార్తలపై మీడియాతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్​నేతలు అనిల్​కుమార్​రెడ్డికి ఫోన్లు చేయగా.. ఆయన స్పందించలేదు. ఆయన అనుచరులు మాత్రం కుంభం బీఆర్​ఎస్​లోనే ఉంటారని తెలిపారు. హైదరాబాద్​లోని ఇంట్లోనే ఉన్నారంటూ చెప్పుకొచ్చారు.