ఈనా కొడుకులను తొక్కి పడేస్త.. ఏమనుకుంటున్నరు!

 ఈనా కొడుకులను తొక్కి పడేస్త.. ఏమనుకుంటున్నరు!

గద్వాల, వెలుగు: సిగ్గుందా ఈ ఆఫీసర్లకు.. సమాచారం ఇవ్వరు.. నీళ్లు వదలరు.. ఈనా కొడుకులను తొక్కి పడేస్తా ఏమనుకుంటున్నారు.. అంటూ ఇరిగేషన్ డీఈపై ఆర్డీఎస్​మాజీ చైర్మన్, టీఆర్ఎస్ లీడర్ తనగల సీతారాంరెడ్డి ఎమ్మెల్యే ముందే ఫైర్ అయ్యారు. మంగళవారం తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నీటి విడుదల సందర్భంగా టీఆర్ఎస్ లోని వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆఫీసర్లపై టీఆర్ఎస్ లీడర్ ఫైర్ అయ్యారు. నోటికొచ్చినట్లు మాట్లాడారు. అదే సమయంలో పార్టీలో పరిస్థితిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు మెంబర్ గా గెలవనోళ్లు కూడా టీఆర్ఎస్​లో చైర్మన్ అవుతున్నారు. వాడెవడో రాందేవ్ రెడ్డి మొన్నటికి మొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యాడు. నిన్న మొన్న వచ్చిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మేము ఆలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సపోర్ట్ చేయలేదా.. ఆయన కోసం తిరగలేదా.. రెడ్లకు పదవులు రావని చెబుతున్నా రు ఇదెక్కడి న్యాయం అంటూ తనగల సీతారాం రెడ్డి మండిపడ్డారు.