తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిరిగి బీజేపీలో చేరారు. చెన్నైలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కషాయ కండువా కప్పి తమిళిసైని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కిషన్రెడ్డి. ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ గా తమిళిసై 2019 సెప్టెంబర్ 8న బాధ్యతలు చేపట్టగా.. 4 ఏండ్ల 6 నెలల 10 రోజుల పాటు పనిచేశారు.
కాగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నందున తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడు లోని కన్యాకుమారి లేదా తిరునల్వేలి లేదా చెన్నై సౌత్ లేదా పుదుచ్చేరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. బీజేపీ సైతం మెజారిటీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. త్వరలో పెండింగ్ లో ఉన్న సీట్లకు క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉన్నందున , రాజీనామాకు బీజేపీ హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే తమిళిసై పదవి నుంచి వైదొలిగినట్టు సమాచారం.