లేడీ అడ్వకేట్ హత్య కేసులో నలుగురు అరెస్ట్... అన్నతోపాటు ముగ్గురి ని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన పోలీసులు

లేడీ అడ్వకేట్ హత్య కేసులో నలుగురు అరెస్ట్... అన్నతోపాటు ముగ్గురి ని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన పోలీసులు

చేవెళ్ల, వెలుగు: లేడీ అడ్వకేట్​ స్వప్న హత్య కేసులో సొంత అన్న సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు భూ వివాదమే కారణమని తేల్చారు. గురువారం మొయినాబాద్​ పీఎస్​లో కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. చేవెళ్ల కోర్టులో అడ్వొకేట్​గా ప్రాక్టీస్​ చేస్తున్న గొటికె స్వప్న (34), ఆమె అన్న గొటికె రాజుకు మొయినాబాద్​ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలోని సర్వే నంబరు 339లో 4 ఎకరాల భూమిపై వివాదం నడుస్తోంది. ఈ భూమిని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో  రాజు పలువురితో కలిసి స్వప్న హత్యకు కుట్ర పన్నాడు. 

గురువారం ఉదయం స్వప్న, ఆమె తల్లి వెంకటమ్మ భూ సర్వే చేస్తున్నారని తెలుసుకున్న నిందితులు.. అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సర్వే పూర్తి చేసుకొని వెంకటాపూర్- నక్కలపల్లి రహదారికి దగ్గరికి వచ్చిన స్వప్నను కారుతో ఢీకొట్టడంతో ఆమె ఒక గుంతలో  పడిపోయింది. వెంటనే పెద్ద కర్రలు, రాళ్లతో స్వప్న తలపై దాడి చేసి.. కొడవలితో గొంతు కోయడంతో ఆమె మరణించారు.