నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్.. సిద్ధం సభలో జగన్

నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్.. సిద్ధం సభలో జగన్

మేదరమెట్లలో ఉప్పెనలా వచ్చిన జనసమూహం కనిపిస్తుందని సీఎం జగన్ అన్నారు.మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందన్నారు. ఓటు అనే అస్త్రం ప్రయోగించాల్సిన సమయం వచ్చిందన్నారు.  మరో  ఐదేళ్లు ఈ ప్రయాణం కొసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఈ జనసమూహానికి జగన్ సెల్యూట్ చేశారు.పేదవాడి భవిష్యత్తుకు మీరంతా సిద్ధమేనా అని జగన్ ప్రశ్నించారు.

పార్టీల పొత్తుతో చంద్రబాబు.. ప్రజలే బలంగా మనం తలపడుతున్నామని జగన్ అన్నారు. వచ్చే ఎన్నికలు విశ్వసనీయతకు.. వంచనకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.  సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం .. జగన్ ను ఓడించాలని వారు చూస్తున్నారు... పేదలను గెలిపించాలని నేను చూస్తున్నానని సీఎం జగన్ మేదరమెట్ల సిద్ధం సభలో అన్నారు.

ALSO READ :- ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే డయాబెటిస్‭కు చెక్

ఈ యుద్దంలో అర్జునిడి పాత్ర నాది... కృష్ణుడి పాత్ర మీది .. నాకు నటించే పొలిటికల్ స్టార్స్ లేరు.. నాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లని సీఎం జగన్ అన్నారు.