నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. హైదరాబాద్ నుంచి రాయచూరు వెళ్తున్న కారు అదుపుతప్పి అతివేగంగా రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో… నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఐదేళ్ల చిన్నారి ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది.