రాజ్యసభ ఎన్నికల వేళ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా
అహ్మదాబాద్: త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. శనివారమే లెటర్లు అందాయని, వారి రాజీనామాలను ఆమోదించానని స్పీకర్ త్రివేది ఆదివారం ప్రకటించారు. ఆ నలుగురు ఎవరనేది సోమవారం జరిగే అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు. దీంతో ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 73 నుంచి 69కి పడి పోయింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ మిగతా ఎల్యేలను జైపూర్కు తరలించింది. ఈ నెల 26న రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా.. బీజేపీ ముగ్గురు కేండిడేట్లను పోటీకి దించింది. ఆ పార్టీకి ఉన్న బలంతో ఇద్దరు గెలిచే అవకాశాలు ఉండగా.. మూడో వ్యక్తిని కూడా గెలిపించుకోవాలనే వ్యూహంతో ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది.
For More News..