బీరు​ సీసాలతో యువకుడి గొంతు కోసిన ఫ్రెండ్స్

బీరు​ సీసాలతో యువకుడి గొంతు కోసిన ఫ్రెండ్స్

శేరిలింగంపల్లి, వెలుగు:  బీరు సీసాలతో స్నేహితులే  యువకుడి గొంతు కోసి పరారైన  ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు చెందిన  విజయ్ కుమార్(23) కొన్నేండ్ల క్రితం ఫ్యామిలీతో కలిసి సిటీకి వచ్చి పాపిరెడ్డికాలనీలో ఉంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం విజయ్ కుమార్ పెద్ద కొడుకు బర్త్ డే ఉండటంతో సాయంత్రం ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాడు.  తర్వాత విజయ్ కుమార్  రాత్రి 9 గంటలకు తన ఫ్రెండ్స్ ముగ్గురితో కలిసి బయటికెళ్లి శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసు పక్కన లింక్ రోడ్​లో  మద్యం తాగాడు. ఈ క్రమంలో అతడికి ఫ్రెండ్స్​కి మధ్య గొడవ మొదలైంది. బీరు సీసాలతో అతడి ఫ్రెండ్స్​ విజయ కుమార్​ గొంతు కోసి పరారయ్యారు. పోలీసులు గాయపడ్డ విజయ్ ​ను ఉస్మానియాకు తరలించారు.  ప్రస్తుతం అతడి హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిలో ఒకరిని నగేశ్​గా పోలీసులు గుర్తించారు. అతడు కూడా గుల్బర్గా నుంచి వచ్చి పాపిరెడ్డినగర్​లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు.   మిగతా ఇద్దరు నిందితులు ఎవరు,  వీరి మధ్య ఎందుకు గొడవ జరిగిందనే విషయాలు తెలియవని పోలీసులు చెప్పారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.