మ్యానుఫాక్చరింగ్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నాం

మ్యానుఫాక్చరింగ్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నాం

న్యూఢిల్లీ: దేశ ఎకానమీని పరిపుష్టం చేయడంలో మ్యానుఫాక్చరింగ్ రంగం కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోడీ అన్నారు. ప్రముఖ ఇండస్ట్రీ లీడర్స్‌‌తో నిర్వహించిన వెబినార్‌‌లో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. మినిమం గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అనేది తమ మంత్రమని ఆయన స్పష్టం చేశారు. ‘మ్యానుఫాక్చరింగ్ రంగంలో మా ప్రభుత్వం వెనువెంటనే పలు సంస్కరణలు తీసుకొచ్చింది. మా విధానం, స్ట్రాటజీ ఒకటే.. తక్కువ ప్రభుత్వ జోక్యంతో ఎక్కువ పాలన సాగాలనే దాన్ని మేం నమ్ముతాం. మన కంపెనీలను మ్యానుఫాక్చరింగ్ రంగంలో గ్లోబల్ స్థాయి పోటీదారులుగా నిలపాలంటే అహర్నిశలు కృషి చేయాల్సి ఉంటుంది’ అని మోడీ చెప్పారు.