రెండుసార్లు  అంత్యక్రియలు

రెండుసార్లు  అంత్యక్రియలు

మొగుళ్లపల్లి/టేకుమట్ల, వెలుగు: ఒకే మృతదేహానికి రెండుసార్లు అంత్యక్రియలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం అంకుశాపురానికి చెందిన గురుకుంట్ల భద్రమ్మ అనే వృద్ధురాలు ఇటీవల అనారోగ్యంతో చనిపోయింది. గ్రామ శివారు చలివాగు ఒడ్డున కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేశారు. మూడు రోజులుగా కురుస్తున్న వానలకు చలివాగు ఉప్పొంగి పూడ్చిన శవం వరదలో కొట్టుకువచ్చి వెలిశాల గ్రామ శివారులో చెట్ల కొమ్మలకు చిక్కుకుంది. అది  భద్రమ్మ శవంగా గుర్తించిన కుటుంబసభ్యులు మంగళవారం మరోసారి  అంతక్రియలు చేశారు.