డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ట్రైనింగ్​ ఇవ్వాలి : జి.రవినాయక్

డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ట్రైనింగ్​ ఇవ్వాలి : జి.రవినాయక్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తులను ఎంట్రీ చేసేందుకు ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ జి.రవినాయక్  ఆదేశించారు. సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. శుక్రవారం నుంచి కంప్యూటర్ లో ఎంట్రీ చేయాలన్నారు.  జిల్లాలో 213 సిస్టమ్స్ తో పాటు 400 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించామని తెలిపారు.

ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవాలని, 3 విడతలుగా డేటా ఎంటర్  చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఆఫీసుల్లోనే ఈ ప్రక్రియ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్​ సంస్థలు, ఆఫీసుల్లో చేయవద్దన్నారు. డేటా భద్రంగా ఉంచే బాధ్యత టీమ్  లీడర్లపై ఉందన్నారు. అడిషనల్  కలెక్టర్లు  శివేంద్రప్రతాప్, ఎస్ .మోహన్ రావు పాల్గొన్నారు.