గోవులను తీసుకెళ్లేందుకు అంబులెన్స్​  

గోవులను తీసుకెళ్లేందుకు అంబులెన్స్​  

శంషాబాద్, వెలుగు: నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకృష్ణ గోశాలకు హైడ్రాలిక్ లిఫ్ట్ తో కూడిన అంబులెన్స్ ను  జీఎస్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ అందజేసింది. నార్సింగి మున్సిపల్ చైర్ పర్సన్ రేఖ,  వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ పాల్గొని నిర్వాహకులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మనుషులను తరలించేందుకు అంబులెన్స్ లు ఉండగా, గోవుల కోసం ఫస్ట్​ టైమ్​ హైడ్రాలిక్ లిఫ్ట్ తో అంబులెన్స్ ఉండడం విశేషమని, ఇది ఎంతగానో సహాయపడుతుందని పేర్కొన్నారు.  నార్సింగి  నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో సేవలను అందించనుంది. హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ సహకారంతో మంజు అగోలు ఇస్మిత మద్దతుతో రెండు నెలలో అంబులెన్స్ తయారు చేయగా, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గోశాల ఫౌండర్, చైర్మన్ నవీన్ జైన్, మంజు బదలియ, కరిష్మా జైన్, మధు జైన్, రీతూ జైన్  తదితరులు పాల్గొన్నారు.