మే 13న కాంగ్రెస్కు వేసే ఓట్లతో మోదీ కుర్చీ కదలాలి

మే 13న  కాంగ్రెస్కు వేసే ఓట్లతో మోదీ కుర్చీ కదలాలి

సింగరేణిని అమ్ముకున్న ఘనత కేసీఆర్ దేనన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. కాసిపెట్ - 2 ఇంక్లైన్ సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు.  ఈ సందర్బంగా  మాట్లాడిన ఆయన..బీజేపీ  ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందన్నారు.13వ తేదీన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేస్తే  నరేంద్ర మోదీ కుర్చీ కదలాలన్నారు.


తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అనుకుంటే బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందన్నారు. ఇద్దరు ఎంపీలతో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధిస్తే పదేళ్లలో13 మంది ఎంపీలతో బీఆర్ఎస్ ఏం సాధించిందో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్  ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు.  బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక దందా,భూ కబ్జాలు, స్కాములు పెరిగాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ నిరుద్యోగుల తెలంగాణగా మారిందన్నారు. కష్టాల్లో ఉన్న కంపెనీలను ఆదుకొని ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొస్తామని చెప్పారు.