స్టూడెంట్లకు గొడుగుల పంపిణీ చేసిన వివేక్​ వెంకటస్వామి

స్టూడెంట్లకు గొడుగుల పంపిణీ చేసిన వివేక్​ వెంకటస్వామి

కాటారం, వెలుగు : మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుధవారం కాకా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్​ వెంకటస్వామి ఆదేశాలతో గొడుగులు పంపిణీ చేశారు. 

వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివేక్​ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లగా గొడుగులు పంపించారని, అలాగే గతంలో బెంచీలు అందించారని బీజేపీ నాయకులు వెల్లడించారు. 

పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని, కాకా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం తిరుపతి, చింతకాని ఎంపీటీసీ ఉడుముల విజయ, బీజేపీ నాయకులు గంట అంకయ్య, వెంకట్​రెడ్డి,మంత్రి సునీల్​,శ్రీశైలం,రాజులు పాల్గొన్నారు.