బీజేపీతోనే బీసీలకు న్యాయం: కుందారం గణేశ్​చారి

బీజేపీతోనే బీసీలకు న్యాయం: కుందారం గణేశ్​చారి

ముషీరాబాద్/షాద్ నగర్, వెలుగు: బీసీలకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని బీసీ కులాల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అన్నారు. బీసీలకు రాజకీయ సముచిత స్థానం బీజెపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం ముసారాం బాగ్ వద్ద బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో నేతలు ప్రధాని మోడీ ఫొటోకు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా గణేశ్ చారి మాట్లాడుతూ.. బీసీని సీఎం చేస్తామన్నా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సీఎం ప్రకటనపై  షాద్ నగర్ చౌరస్తాలో బీజేపీ నేతలు సంబురాలు చేసుకున్నారు. మోడీ ఫొటోకు పాలాభిషేకం చేశారు.